Homeజిల్లాలుకామారెడ్డిIrrigation projects | ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద.. గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న అధికారులు

Irrigation projects | ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద.. గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న అధికారులు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నిధులు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి : Irrigation projects | శ్రీరాంసాగర్​, నిజాంసాగర్​లకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయాల్లోని (reservoirs) మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.

Irrigation projects | ఎస్సారెస్పీలో..

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు (Sriram Sagar Project) బాబ్లీ నుంచి ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గురువారం నాలుగు వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21,954 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు.

ఎస్కేప్​ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు (Saraswati canal) 650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాకతీయ, లక్ష్మి కాల్వలకు నీటి విడుదలను నిలిపేశారు. ఇక మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.501 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.

Irrigation projects | నిజాంసాగర్​లో..

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 9,570 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది.