అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి : Irrigation projects | శ్రీరాంసాగర్, నిజాంసాగర్లకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయాల్లోని (reservoirs) మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.
Irrigation projects | ఎస్సారెస్పీలో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు (Sriram Sagar Project) బాబ్లీ నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గురువారం నాలుగు వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21,954 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు.
ఎస్కేప్ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు (Saraswati canal) 650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాకతీయ, లక్ష్మి కాల్వలకు నీటి విడుదలను నిలిపేశారు. ఇక మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.501 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.
Irrigation projects | నిజాంసాగర్లో..
నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 9,570 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది.
