HomeతెలంగాణSriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద

Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు వరద గేట్ల ద్వారా నీటి విడుదలను సైతం తగ్గించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం స్వల్పంగా ఇన్​ఫ్లో(Inflow) వస్తోంది.

ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 41,867క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.90 (80.05 టీఎంసీలు) అడుగులకు చేరింది.

Sriram Sagar | నాలుగు గేట్లు ఎత్తివేత

ప్రాజెక్ట్​లోకి వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం 8 గేట్ల ద్వారా గోదావరి(Godavari)లోని నీటిని వదిలిన అధికారులు సోమవారం నాలుగు గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం నాలుగు గేట్ల ద్వారా 12,320 క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Sriram Sagar | కాలువల ద్వారా..

శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్(​Sriram Sagar Project)నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఆయకట్టు కింద సాగు అవుతున్న పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్​ భగీరథ(Mission Bhagiratha)కు 231క్యూసెక్కులు వదులుతుండగా, 666 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది.

గోదావరి మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నిర్మించిన వరద కాలువకు 20 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా మిడ్​ మానేరు(Mid Maneru)కు నీటిని తరలిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరద కాలువతో పాటు గాయత్రి పంప్​హౌస్​ ద్వారా మిడ్​మానేరుకు నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్ట్​లో ప్రస్తుతం 18 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద కాలువ ద్వారా ఇన్​ఫ్లో కొనసాగుతుండటంతో మిడ్​మానేరు నుంచి ఎల్​ఎండీకి 10 వేల క్యూసెక్కులు, ప్యాకేజీ –10 అనంతగిరి 9,600 క్యూసెక్కులు వదులుతున్నారు.

Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి

ఎస్సారెస్పీ నుంచి వరద గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్​ ఏఈఈ కొత్త రవి(Project AEE Kotha Ravi) సూచించారు. ప్రాజెక్ట్​ నుంచి మొత్తం 41,867 క్యూసెక్కుల ఔట్​ఫ్లో నమోదు అవుతోందన్నారు. నదిలో, కాలువల్లో చేపల వేటకు, స్నానానికి వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.