అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad | నిజామాబాద్(Nizamabad) నగరంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్దగల సాయి టిఫిన్ సెంటర్(Sai Tiffin Center)లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో టిఫిన్ సెంటర్లో కస్టమర్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
