అక్షరటుడే, వెబ్డెస్క్ : NEET Exam | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం Neet entrance exam కోసం నిర్వహించే నీట్ పరీక్షపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఎన్టీఏ NTA చర్యలు చేపట్టింది. నీట్పై తప్పుడు ప్రచారం చేస్తున్న 120కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించింది.
సంబంధిత సోషల్ అకౌంట్లపై కేసులు నమోదు చేయాలని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు బదిలీ చేసింది. అలాగే ఈ అకౌంట్లను తొలగించాలని టెలిగ్రామ్ telegram, ఇన్స్టాగ్రామ్ instagram సంస్థలను సైతం వివరణ కోరినట్లు సమాచారం. నీట్ పరీక్షపై తప్పుడు ప్రచారం చేస్తున్న, భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై ఫిర్యాదు చేయడానికి ఎన్టీఏ ఇటీవల పోర్టల్ nta portal ప్రారంభించింది. దీంతో భారీగా ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువ శాతం టెలిగ్రామ్ ఛానల్ లింక్లే ఉన్నట్లు సమాచారం. కాగా.. ఆయా ఛానెళ్లపై చర్యలకు అధికారులు సిద్ధం అయ్యారు.