అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | జమ్మూ కశ్మీర్లో సోమవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక టెర్రరిస్ట్ హతం అయ్యాడు.
కుల్గాంలోని గూడార్ అటవీ ప్రాంతం(Goodar Forest Area)లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్(Encounter)లో ఒక ఉగ్రవాది హతం అయ్యాడు. ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Encounter | పక్కా సమాచారంతో..
కుల్గాంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని జమ్మూ కశ్మీర్ పోలీసులు(Jammu Kashmir Police) సమాచారం అందించారు. దీంతో భారత సైన్యం, కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్(Search Operation) చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎన్కౌంటర్ ప్రారంభించడంతో ఒక ఉగ్రవాది హతం అయ్యాడు. ఈ ప్రాంతంతో మరో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో కూంబింగ్(Coombing) చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.
Encounter | ఉగ్రవాదుల ఏరివేత
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రత బలగాలు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. నిత్యం సెర్చ్ ఆపరేషన్ చేపడుతూ టెర్రరిస్టుల ఆట కట్టిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత్, కశ్మీర్లోని టెర్రరిస్టులను ఏరివేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు పదుల సంఖ్యల్లో ఎన్కౌంటర్లు చోటుచేసుకోగా అనేక మంది ఉగ్రవాదులు(Terrorists) మరణించారు. ఆపరేషన్ మహదేవ్ చేపట్టి పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను సైతం బలగాలు మట్టుబెట్టాయి.