అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bichkunda Municipality | అధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantharao) అన్నారు. ఈ మేరకు బిచ్కుంద మున్సిపాలిటీలో (Bichkunda Municipality) గురువారం ప్రచారం నిర్వహించారు.
రెండేన్నరేళ్లలో అనేక పథకాలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ,సేవలను కొనసాగిస్తోందన్నారు.
మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం..
అధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకుంటే బిచ్కుంద పట్టణం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. సరైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
1 comment
[…] Election Money Distribution | బిచ్కుంద మున్సిపాలిటీలో (Bichkunda Municipality) జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లను మభ్య […]
Comments are closed.