అక్షరటుడే, బోధన్ : MLA Sudarshan Reddy | రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి బోధన్ పట్టణ అభివృద్ధికి సహకరించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో గురువారం ఆయన కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
MLA Sudarshan Reddy | పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality) తీవ్రంగా వెనుకబడి పోయిందని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే బోధన్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రహదారులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్, పట్టణ శోభ వంటి అంశాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.