అక్షరటుడే, వెబ్డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి బైక్(Bike)ను ఢీకొంది. ఈ ఘటన రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని జైపూర్లో చోటుచేసుకుంది. కారుతో బైక్ను ఢీకొనడంతో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన మహిళలను పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు.
