అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City Police | నగరంలో అర్ధరాత్రి వరకు దోశసెంటర్ (Dosha Center) తెరిచి ఉంచిన ఒకరికి న్యాయస్థానం(Court) జైలుశిక్ష విధించించి. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి(One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. మాలపల్లిలో (Malapalli) అబ్దుల్ ఆసిఫ్ అర్ధరాత్రి వరకు దోశ సెంటర్ను తెరిచి ఉంచడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరు పర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్హెచ్వో తెలిపారు.