Homeక్రైంMaharashtra | వైద్యురాలి ఆత్మహత్య కేసు.. లొంగిపోయిన ఎస్సై

Maharashtra | వైద్యురాలి ఆత్మహత్య కేసు.. లొంగిపోయిన ఎస్సై

Maharashtra | మహారాష్ట్రలో వైద్యురాలి ఆత్మహత్య కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఆమెపై వేధింపులకు పాల్పడ్డ ఎస్సై లొంగిపోయాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra | మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వైద్యురాలి ఆత్మహత్య (Doctor Suicide) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై గోపాల్​ బదానే లొంగిపోయాడు. ఎస్సై వేధింపులతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె అరచేతిలో సూసైడ్​ నోట్​ రాసిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలోని సతార జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యురాలు (26) రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గోపాల్​ బాదానే (SI Gopal Badane) తనపై అత్యాచారం చేశాడని ఆమె చేతిలో సూసైడ్​ నోట్​ రాసింది. ఎస్సై వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆమె ఇంట్లో నాలుగు పేజీల సూసైడ్​ నోట్​ కనుగొన్నారు.

Maharashtra | ఎంపీపైనా ఆరోపణలు

తనను ఓ ఎంపీ సైతం బెరించాడని ఆమె లేఖలో ఆరోపించింది. వైద్య పరీక్షలకు తీసుకు రాకుండానే ఫిట్​నెస్​ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులు తనను ఒత్తిడి చేశారని పేర్కొంది. అయితే తాను అందుకు నిరాకరించడంతో ఎస్సై గోపాల్‌తో పాటు మరికొందరు పోలీసు అధికారులు వేధింపులకు గురిచేశారని వాపోయింది. ఎస్సై తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తప్పుడు ఫిట్​నెస్​ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ ఎంపీ సైతం తనను బెదిరించారని ఆమె లేఖలో పేర్కొంది. తన ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్‌ బంకర్‌ సైతం వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.

Maharashtra | నిందితులపై కేసు నమోదు

వైద్యురాలి ఆరోపణల నేపథ్యంలో ఎస్సై గోపాల్​, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సైని సస్పెండ్​ చేయడంతో మరో నిందితుడు ప్రశాంత్​ను ఇప్పటికే అరెస్ట్​ చేశారు. అయితే తాజాగా ఎస్సై గోపాల్​ లొంగిపోయాడు. ఫల్తాన్ పోలీస్​ స్టేషన్​ (Phaltan Police Station)లో ఆయన లొంగిపోయాడు.