అక్షరటుడే, కామారెడ్డి: Neelam Kalavati Ramesh | కౌన్సిలర్గా పోటీచేస్తున్న తనకు వార్డు అభివృద్ధే ధ్యేయమని కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి 10వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్ (Neelam Kalavati Ramesh) తెలిపారు. ఈ మేరకు గురువారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Neelam Kalavati Ramesh | ఇంటింటికీ తిరుగుతూ..
ఈ సందర్భంగా వార్డులో ఆయా సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆరోగ్య సమస్యలపై ఆరా తీస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ.. వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తానన్నారు. వార్డు సమస్యలు (ward’s problems) తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున..
తమ పార్టీ అధికారంలో ఉన్నందున వార్డుకు ప్రత్యేక నిధులు తీసుకువస్తానని నీలం కళావతి రమేష్ తెలిపారు. ఓటువేసి గెలిపిస్తే సేవకురాలిగా ఉంటానని తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గెలిచిన అనంతరం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని పేర్కొన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా తనను నేరుగా కలవవచ్చన్నారు. గెలిస్తే తన భర్తతో పెత్తనం చేయించే వ్యక్తిని కాదన్నారు. సమస్య ఏదైనా పరిష్కారానికి తానే ముందుంటానని స్పష్టం చేశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు.
