Homeతాజావార్తలుJubilee Hills | జూబ్లీహిల్స్​ బీజేపీ అభ్యర్థిగా దీపక్​రెడ్డి

Jubilee Hills | జూబ్లీహిల్స్​ బీజేపీ అభ్యర్థిగా దీపక్​రెడ్డి

Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్​రెడ్డికి టికెట్​ ఇస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by Election) పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. లంకల దీపక్​రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పలు రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్​ స్థానం నుంచి దీపక్​రెడ్డి (Deepak Reddy)కి అవకాశం ఇచ్చింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం లంక‌ల దీప‌క్‌రెడ్డి, కీర్తిరెడ్డి, ప‌ద్మ‌ పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో దీపక్​రెడ్డి వైపు కేంద్ర నాయకత్వం మొగ్గు చూపింది. కాగా దీపక్​రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు 25 వేల ఓట్లు వచ్చాయి. తాజాగా మరోసారి బరిలో నిలవనున్నారు.

Jubilee Hills | రసవత్తరంగా పోరు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు నవంబర్​ 11న జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ సైతం దీపక్​రెడ్డిని బరిలో దింపుతున్నట్లు తెలిపింది. బీఆర్​ఎస్​ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ సతీమణి సునీత (Maganti Sunitha) పోటీ చేస్తున్నారు. ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. కాంగ్రెస్​ నుంచి బీసీ కులానికి చెందిన నవీన్​ యాదవ్​ పోటీ చేస్తున్నారు. తాజాగా కమలం పార్టీ రెడ్డికి అవకాశం ఇచ్చింది. మడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.