Cricket tournament | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో సీపీ టీం ఘనవిజయం.. మూడు వికెట్లు తీసిన సీపీ సాయిచైతన్య..

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cricket tournament | జిల్లా కేంద్రంలోని పోలీస్​ పరేడ్​ మైదానంలో (Police Parade Ground) సీపీ టీం వర్సెస్​ ప్రెస్​ క్లబ్​ ఎలెవన్​ టీం మధ్య క్రికెట్​ మ్యాచ్​ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ పోటీలో సీపీ టీం విజయం సాధించింది. టాస్ గెలిచిన పోలీస్ టీం (Police team) బ్యాటింగ్​ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో జట్టు మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించింది. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి […]

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cricket tournament | జిల్లా కేంద్రంలోని పోలీస్​ పరేడ్​ మైదానంలో (Police Parade Ground) సీపీ టీం వర్సెస్​ ప్రెస్​ క్లబ్​ ఎలెవన్​ టీం మధ్య క్రికెట్​ మ్యాచ్​ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ పోటీలో సీపీ టీం విజయం సాధించింది.

టాస్ గెలిచిన పోలీస్ టీం (Police team) బ్యాటింగ్​ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో జట్టు మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించింది. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkat Reddy) 25 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ప్రెస్ క్లబ్ జట్టు (Press Club team) 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది.

Cricket tournament | సీపీ బౌలింగ్​ హైలెట్​..

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) 3 ఓవర్లు బౌలింగ్​ వేసి ప్రతి ఓవర్​లోడ ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు. ఆయన బౌలింగ్​ మ్యాచ్​కే హైలెట్​గా నిలిచింది. అదనపు డీసీపీ బస్వారెడ్డి ఒక ఓవర్ వేసి ఒక వికెట్ తీశారు. ప్రెస్ క్లబ్ జట్టులో శివ ఠాగూర్ అద్భుతమైన బ్యాటింగ్​ వేసి 24 పరుగులు చేశారు. 43 పరుగుల తేడాతో పోలీస్ జట్టు ప్రెస్ క్లబ్​ జట్టుపై విజయం సాధించింది.

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బెస్ట్ బౌలర్​గా శ్యామ్, ఉత్తమ బ్యాట్స్​మన్​ కిరణ్​లకు సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​ బహమతులు అందజేశారు.

Related articles

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.