అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నగరంలోని సీపీ కార్యాలయంలో (CP Office) సోమవారం ప్రజావాణి (Police Prajavani) కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య హాజరై 11మంది ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, వాటి చట్ట రీత్యా పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
CP Sai Chaitanya | ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి..
ప్రజలు నిర్భయంగా తమ సమస్యలు చెప్పాలని, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని అన్నారు. ప్రజావాణి ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.