Homeతాజావార్తలుconstable murder case | హంతకుడు రియాజ్​ కోసం పోలీసుల జల్లెడ

constable murder case | హంతకుడు రియాజ్​ కోసం పోలీసుల జల్లెడ

constable murder case | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్​ సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ హత్యోదంతం ఘటనపై పోలీసులు సీరియస్​గా ఉన్నారు. రాష్ట్ర డీజీపీ DGP శివధర్​ రెడ్డి సైతం పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా, నిందితుడు రియాజ్​ కోసం కమిషనరేట్​ పోలీసులు పది బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: constable murder case | కమిషనరేట్​ పరిధిలోని సీసీఎస్​ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్​ ప్రమోద్​ Constable Pramod దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

వివిధ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్​ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఠాణాకు తరలిస్తుండగా.. కానిస్టేబుల్​ ప్రమోద్​పై నిందితుడు రియాజ్​ కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ప్రమోద్​ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి మరణించారు. కాగా, ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న కమిషనరేట్​ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు.

ఈ నేపథ్యంలో శనివారం (అక్టోబరు 18) ఉదయం నిజామాబాద్​ జిల్లాకు వచ్చిన ఐజీ చంద్రశేఖర్​రెడ్డి IG Chandrasekhar Reddy.. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. సీపీ సాయి చైతన్యతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కానిస్టేబుల్​ ప్రమోద్​ అంత్యక్రియల్లో ఐజీ, సీపీ పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసు అధికారులు భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో నిందితుడిని త్వరలోనే పట్టుకుని కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.

constable murder case | ఆరో ఠాణా పరిధిలో రియాజ్​ ఆనవాళ్లు..!

నిజామాబాద్​ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్​ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

నిందితుడు రియాజ్​ ఉపయోగించిన బైక్​ .. స్థానిక కెనాల్​ సమీపంలో లభించింది. దీంతో కెనాల్​లో నుంచి దూకి నిందితుడు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రోన్​ (Drone)ల సాయంతో నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు.