Homeజిల్లాలునిజామాబాద్​Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి : Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) చేర్పించాలని డిచ్​పల్లి ఎంఈవో (Dichpally MEO) శ్రీనివాస్​ సూచించారు. మండలంలోని ఘన్​పూర్​ గ్రామంలో శుక్రవారం జెడ్పీహెచ్​, యూపీహెచ్​ఎస్​, హరిజనవాడ పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఘన్​పూర్​ జెడ్పీహెచ్​ఎస్​ ఆనంద్​, రామకృష్ణ, వీడీసీ సభ్యులు గంగాధర్, తిరుపతి, మహేందర్​, మోహన్, గంగమోహన్ పాల్గొన్నారు.