Homeటెక్నాలజీChat GPT | చాట్​ జీపీటీ గుడ్​న్యూస్​.. 5 లక్షల మందికి ఉచిత యాక్సెస్!

Chat GPT | చాట్​ జీపీటీ గుడ్​న్యూస్​.. 5 లక్షల మందికి ఉచిత యాక్సెస్!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chat GPT | ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)​ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. పలు రంగాల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్లాట్​ఫామ్​లు ఏఐ సేవలు అందిస్తున్నాయి.

అందులో చాట్​ జీపీటీ ఒకటి. చాట్​ జీపీటీ (Chat GPT) భారత్​లో తన సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదు లక్షల మందికి చాట్​ జీపీటీ ప్లస్​ యాక్సెస్​ ఉచితంగా ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. భారత్​లో ఐదు లక్షల ఉచిత చాట్​ జీపీటీ ప్లస్ ఖాతాలను పంపిణీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా రాబోయే ఆరు నెలల్లో తమ ఏఐ ప్లాట్‌ఫారమ్‌ (AI Platform) విద్యార్థులకు చేరువ అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు పలు ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. భారత మార్కెట్​లో త్వరగా విస్తరించేందుకు ఓపెన్​ ఏఐ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరిత సమాధానాలు, అసైన్‌మెంట్‌ల కోసమే కాకుండా.. విషయాల యొక్క లోతైన అవగాహనకు మద్దతు ఇచ్చే సాధనంగా AIని మార్చడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది.

Chat GPT | రాఘవ్​గుప్తా నియామకం

ఆసియా పసిఫిక్‌లో కోర్సెరా కార్యకలాపాలకు గతంలో నాయకత్వం వహించిన రాఘవ్ గుప్తా (Raghav Gupta)ను చాట్​జీపీటీ భారత్​లో విద్యా విభాగాధిపదిగా నియమించింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలను చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యా విధానంలో ఏఐ మార్పును తీసుకురాగల దశలో ఉందన్నారు.

Chat GPT | పరిశోధనలకు మద్దతు

ఓపెన్‌ ఏఐ దేశంలో పరిశోధనలకు కూడా మద్దతు ఇస్తోంది. విద్యలో AI పాత్రపై దీర్ఘకాలిక అధ్యయనం కోసం ఐఐటీ మద్రాస్​తో ​(IIT Madras) కీలక ఒప్పందం చేసుకుంది. ఇందు కోసం ఐదు లక్షల డాలర్ల నిధులను కూడా కేటాయించింది. చాట్​ జీపీటీ వంటి సాధనాలు బోధనా పద్ధతులను ఎలా మార్చగలవు, విద్యార్థులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో పరిశోధనలో తేల్చనున్నారు. చాట్​ జీపీటీ భారత్​లో తన మొదటి కార్యాలయాన్ని ఢిల్లీలో ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తామని తెలిపింది.

Chat GPT | రెండో అతిపెద్ద మార్కెట్​

చాట్​ జీపీటీకి అమెరికా (America) తర్వాత భారత్​ రెండో అతిపెద్ద మార్కెట్. దీంతో ఇక్కడ మరింత విస్తరించాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. ఇప్పటికే వినియోగదారుల కోసం నెలకు రూ. 399 ధరతో ప్రత్యేక ప్లాన్​ తీసుకొచ్చింది. తాజాగా OpenAI లెర్నింగ్ యాక్సిలరేటర్ పేరిట ఐదు లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉచిత యాక్సెస్​ అందించనుంది.