ePaper
More
    Homeఅంతర్జాతీయంCeasefire | బ్రేకింగ్​ న్యూస్​.. భారత్​, పాక్​ మధ్య కాల్పుల విరమణ

    Ceasefire | బ్రేకింగ్​ న్యూస్​.. భారత్​, పాక్​ మధ్య కాల్పుల విరమణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Ceasefire | భారత్​ పాకిస్తాన్​ కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు సీజ్​ ఫైర్​కు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య చర్చలు ఫలించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటల భారత్​ డీజీఎంవోకి పాక్​ డీజీఎంవోకు ఫోన్​ చేశారు. అంతేకాకుండా పాక్​ మంత్రి ఇషాక్​దర్​ సైతం ఇదే విధంగా ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య అమెరికా చర్చలు జరిపింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సైతం సోషల్​ మీడియాలో ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించాయి.

    Ceasefire | ఉగ్రదాడితో మొదలు..

    జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​ ఏప్రిల్​ 22న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారని కేంద్ర ప్రభుత్వం దాయాది దేశంపై పలు ఆంక్షలు విధించింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. అనంతరం మే 7న అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్​ పేరిట పీవోకే, పాక్​లోని ఉగ్రస్థావరాలపై భారత్​ విరుచుకుపడింది.

    Ceasefire | ఉలికిపడ్డ పాక్​

    భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టడంతో పాక్​ ఉలికిపడింది. భారత్​ దాడుల్లో వంద మంది వరకు ఉగ్రవాదులు మరణించారు. మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్​ వైమానిక దాడులు చేపట్టింది. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్​కు చెందిన కీలక ఉగ్రవాదులు ఈ ఘటనలో మృతి చెందారు. దీంతో ప్రతీకారంలో రగిలిపోయిన పాక్​ ఎల్​వోసీ వెంబడి సామాన్య పౌరులే లక్ష్యంగా కాల్పులు చేపట్టింది.

    Ceasefire | డ్రోన్లు, క్షిపణులతో దాడి

    ఆపరేషన్​ సిందూర్​ పేరిట భారత్​ దాడులు చేపట్టడంతో పాక్​ ప్రతీకారదాడులు చేపట్టింది. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో భారత్​లోని పలు ప్రాంతాలపై దాడికి యత్నించింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ త 400 పాక్​ డ్రోన్లు, మిసైల్స్​ను మధ్యలోనే కూల్చివేసింది. ఈ క్రమంలో భారత్​ కూడా పాకిస్తాన్​లోని పలు ప్రాంతాలపై ప్రతిదాడులు చేసింది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న క్రమంలో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు పాకిస్తాన్​ డీజీఎంవో భారత్​ డీజీఎంవో చర్చలు జరిపినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రి తెలిపారు. మే 12న మరోసారి డీజీఎంవో స్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...