ePaper
More
    Homeటెక్నాలజీBullet Train | 2028 నాటికి బుల్లెట్ రైలు ప‌రుగులు

    Bullet Train | 2028 నాటికి బుల్లెట్ రైలు ప‌రుగులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Bullet Train | భార‌త్‌లో మ‌రో మూడేళ్ల‌లో బుల్లెట్ ప‌రుగులు పెట్ట‌నుంది. 2028 నాటికి గుజ‌రాత్ లోని స‌బ‌ర్మ‌తి-వాపి మ‌ధ్య హైస్పీడ్ రైలు(High-speed train) పట్టాలెక్కే అవ‌కాశ‌ముంది.

    2030 నాటికి ముంకి.మీ పొడవైన అహ్మదాబాద్-ముంబై కారిడార్‌లో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అహ్మదాబాద్-ముంబై కారిడార్.. మహారాష్ట్రలోని ముంబై-బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), థానే, విరార్, బోయిసర్, గుజరాత్‌లోని వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ సబర్మతి మీదుగా వెళ్తుంది.

    దీని మొత్తం పొడవు దాదాపు 508 కి.మీ. ఈ హై-స్పీడ్ రైలు గుజరాత్ కారిడార్ దాదాపు 348 కి.మీ.లు, ముంబై విభాగం దాదాపు 156 కి.మీ. ఉంటుంది. ఇటీవ‌ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav) మాట్లాడుతూ.. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్‌లో 300 కి.మీ. వయాడక్ట్ పూర్తయినట్లు చెప్పారని న్యూస్ 18 వెల్ల‌డించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని ముంబై బుల్లెట్ రైలు స్టేషన్‌లో తవ్వకం పనుల్లో 76 శాతం పూర్తయ్యాయి. ఇంకా, దాదాపు 383 కి.మీ. పైర్ పని, 326 కి.మీ. గిర్డర్ కాస్టింగ్ మరియు 401 కి.మీ. ఫౌండేషన్ కూడా పూర్తయ్యాయి.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...