అక్షరటుడే, హైదరాబాద్: Breezers | తెలంగాణ Telangana లో గత కొన్ని వారాలుగా బ్రీజర్ల వంటి తేలికపాటి ఆల్కహాల్ డ్రింక్స్ సరఫరాలో అంతరాయం వల్ల తీవ్ర కొరత ఏర్పడుతోందని మద్యం ప్రేమికులు, దుకాణదారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి వల్ల మద్యం దుకాణాల్లో స్టాక్ ఔట్ బోర్డు దర్శనం ఇచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల తాము ఇబ్బంది పడుతున్నట్లు మందుబాబులు అంటున్నారు.
Breezers | కారణం అదేనా..
మద్యం కంపెనీలు, సరఫరాదారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు (ప్యాండ్ బిల్లులు) కారణంగా సరఫరా నిలిపివేసినట్లు పరిశ్రమల ప్రతినిధులు, రాజకీయ నాయకులు చెబుతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లనే కొన్ని మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు, ముఖ్యంగా బ్రీజర్ల వంటి కంపెనీలు పానీయాల సరఫరాను నిలిపేసినట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు Former minister and MLA T. Harish Rao ప్రకటించిన వివరాల ప్రకారం.. గత 16 నెలల్లో సుమారు ₹ 4,500 కోట్ల వరకు లిక్కర్-సప్లై కంపెనీలకు తెలంగాణ సర్కారు బకాయి ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే బ్రీజర్ల సరఫరా తగ్గిపోయిందని తెలుస్తోంది.
రాష్ట్రంలో మద్యపు వినియోగం ఎక్కువగా ఉంటోంది. డిసెంబర్, 2025లో మద్యం విక్రయాలు రూ.5,102 కోట్లు దాటింది. విస్కీ Whiskey, రమ్ rum, బ్రాండి brandy, జిన్ gin, బ్రీజర్ల వాటికి అధిక డిమాండ్ కనిపించింది. రోజు వారీ మద్యం అమ్మకాలు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉండగా.. కేవలం డిసెంబరు 31 వ తేదీనే రూ. 350 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.