Homeతాజావార్తలుHarish Rao | కాంగ్రెస్​ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ.. హరీశ్​రావు ఆగ్రహం

Harish Rao | కాంగ్రెస్​ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ.. హరీశ్​రావు ఆగ్రహం

సీఎం రేవంత్​రెడ్డి బస్తీ దవాఖానలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. శేరి లింగంపల్లిలోని బస్తీ దవాఖానను ఆయన పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​ ప్రభుత్వంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసిందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో బస్తీ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) బస్తీ దవాఖానలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్​ఎస్​ హయాంలో పెట్టిన బస్తీ దవాఖానాలను కేంద్ర ఆర్థిక సంఘం సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బస్తీ దవాఖానాల్లో మందులు, బీపీ మిషన్లలో బ్యాటరీలు లేవు అన్నారు. ఉద్యోగులకు జీతాలు సైతం సక్రమంగా చెల్లించడం లేదని ఆయన అన్నారు.

Harish Rao | మందులు లేక ఇబ్బందులు

బస్తీ ప్రజలకు వైద్యం అందించాలని కేసీఆర్ హయాంలో 450 దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు హరీశ్​రావు (Harish Rao) చెప్పారు. వాటిలో 110 రకాల మందులు, 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారన్నారు. కానీ కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక వాటి గురించి కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్​పై (KCR) కోపంతో సీఎం రేవంత్​రెడ్డి కేసీఆర్ కిట్ పథకం తీసేశారని విమర్శించారు.

Harish Rao | ఆదాయం కోసం గడువు పెంచారు

సీఎం రేవంత్​రెడ్డికి మద్యం దుకాణాలపై ఉన్న దృష్టి పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానాలపై లేదని హరీశ్​రావు విమర్శించారు. జనం మద్యం తాగాలి, ఖాజానా నిండాలన్నదే రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు. ఎవరూ అడగకున్నా మద్యం దుకాణాల దరఖాస్తుల గడువును పెంచారని చెప్పారు. రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు చేశారన్నారు. కాగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills Constituency) బోరబండ డివిజన్‌ వినాయకరావు నగర్‌లో బస్తీ దవాఖానాను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. హెల్త్ చెకప్ చేయించుకొని, డాక్టర్ల సమస్యలను తెలుసుకున్నారు.