అక్షరటుడే, వెబ్డెస్క్: She Team | మహిళలకు ఫోన్, మెసేజ్లు చేస్తూ వేధిస్తున్న ఆకతాయిలను షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ వన్ టౌన్, బోధన్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకతాయిలపై ఫిర్యాదులు రావడంతో షీ టీం పోలీసులు స్పందించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. మహిళలను వేధిస్తే భయపడకుండా షీ టీంకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
