7
అక్షరటుడే, వెబ్డెస్క్: AP Earthqauke | ఆంధ్రప్రదేశ్లో భూప్రకంపనలు భయాందోళనలు కల్పించాయి. పల్నాడు జిల్లాలో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2:33 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ National Center for Seismology గుర్తించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది. వినుకొండ Vinukonda కు 20 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది.
AP Earthqauke | సమీప ప్రాంతాల్లోనూ ప్రభావం..
పల్నాడు జిల్లాలోని వినుకొండతో పాటు దర్శి, సమీప ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. ప్రకంపనలు స్వలంగానే ఉండటంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.