అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan | పాకిస్తాన్(Pakistan)లో మరో ఉగ్రవాది(Terrorost) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జైషే మహమ్మద్(Jaish-e-Mohammed) సంస్థకు చెందిన అబ్దుల్ అజీజ్ బహవల్పూర్లో చనిపోయి కనిపించాడు. అజీజ్ గతంలో భారత్(India)ను ముక్కలు చేస్తానని వ్యాఖ్యానించాడు. మంగళవారం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతిపై జైషే సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. అతనికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు చెబుతున్నారు.
