అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Bandh | రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ (BC JAC) ఆధ్వర్యంలో శనివారం బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పాల్గొన్నారు.
కవిత జూబ్లీహిల్స్లోని జాగృతి కార్యాలయం నుంచి ఖైరతాబాద్ (Khairatabad) వరకు ఆటోలతో ర్యాలీగా వచ్చారు. అనంతరం బంద్ (BC Bandh)కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ఆమె నిరసన తెలిపారు. కవిత కుమారుడు ఆదిత్య సైతం ఆందోళనలో పాల్గొన్నారు.
Telangana Bandh | బీసీలను మోసం చేస్తున్నాయి
కవిత మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేస్తామన్నారు. బీసీ బంద్కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాను బ్లాక్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు చేసిన మోసాలతో బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Bandh | ఆ పార్టీలు పాల్గొనడం దారుణం
ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలో ఆ పార్టీలు కూడా బీసీ బంద్ లో పాల్గొనడం నవ్వులాటగా అనిపిస్తోందని కవిత విమర్శించారు. రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలపాల్సిన బీజేపీ, దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలు బంద్లో పాల్గొనడం దారుణమన్నారు. బీసీ బిడ్డలను మభ్యపెట్టొద్దని, మోసం చేయొద్దని ఆమె కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకూ పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.