అక్షరటుడే, గాంధారి: Ambulance ఆసుపత్రిలో చికిత్స పొంది, సురక్షితంగా ప్రయాణించాలని అంబులెన్సులో అంబులెన్సులో వస్తున్న పేషెంటుకు మరో ప్రమాదం జరిగింది.
సదరు అంబులెన్సును వెనుక నుంచి ఓ లారీ ఢీకొంది. దీంతో ఇంటికి వెళ్లాల్సిన పేషెంటు మళ్లీ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా Kamareddy district గాంధారి మండలం Gandhari mandal లో చోటుచేసుకుంది.
Ambulance | నిమ్స్లో చికిత్స
వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడకు చెందిన వ్యక్తి కాలు విషయమై హైదరాబాద్ Hyderabad నిమ్స్ NIMS లో గత ఇరవై రోజులుగా చికిత్స అందుకుని అంబులెన్సులో తన తండ్రితో కలిసి బయలుదేరాడు.
కాగా, గాంధారి మండలం తిమ్మాపూర్ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న అంబులెన్సును వెనుక నుంచి ఓ లారీ ఢీకొంది. లారీ lorry ఢీకొన్న ధాటికి అంబులెన్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది.
దీంతో అందులోని పేషెంటుతోపాటు అతడి తండ్రి, అంబులెన్సు డ్రైవరు గాయపడ్డారు. అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.