PM Modi | అమరావతి నగరమే కాదు.. ఒక శక్తి : మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | అమరావతి(Amaravati) నగరం మాత్రమే కాదని.. ఒక శక్తి అని.. ఆంధ్రప్రదేశ్​ను అధునాతన రాష్ట్రంగా మార్చే శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. అమరావతి స్వర్ణాంధ్ర ప్రదేశ్​ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. అమరావతి పున:ప్రారంభోత్సవ పనుల్లో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ‘మీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ తెలుగు ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | అమరావతి(Amaravati) నగరం మాత్రమే కాదని.. ఒక శక్తి అని.. ఆంధ్రప్రదేశ్​ను అధునాతన రాష్ట్రంగా మార్చే శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. అమరావతి స్వర్ణాంధ్ర ప్రదేశ్​ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. అమరావతి పున:ప్రారంభోత్సవ పనుల్లో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ‘మీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ తెలుగు ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి స్వప్నం(Amaravati Dream) సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​(Deputy CM Pawan Kalyan), ఆంధ్రప్రదేశ్​ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్​ వికసిత్​ ఆంధ్రప్రదేశ్​ కోసం కలలుగన్నారని తెలిపారు. వికసిత్​ భారత్​లో భాగంగా ఆంధ్రప్రదేశ్​ అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇది మనమే చేయాలన్నారు.

PM Modi | టెక్నాలజీ చంద్రబాబుని చూసి నేర్చుకున్నా..

నేను ఈ సభలో మీకో రహస్యం చెబుతానని మోదీ అన్నారు. గుజరాత్​ ముఖ్యమంత్రి(Gujarat Chief Minister)గా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్​లో ఐటీ(IT) ఏవిధంగా అభివృద్ధి చేశారో తెలుసుకున్నానని తెలిపారు. నేను ఆ సమయంలో ఆయన నుంచి నేర్చుకున్నానని పేర్కొన్నారు.

PM Modi | రికార్డు స్థాయి స్పీడ్​లో పనుల పూర్తికి సహకారం

రికార్డు స్థాయి స్పీడ్​లో పనులను పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని ప్రధాని మోదీ(Prime Minister Modi) తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాలను కల్పించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. హైవే(High Way)ల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అమృత్​ భారత్(Amruth Bharath)​ కింద అనేక రైల్వేస్టేషన్లను ఆధునీకరించామని చెప్పారు.

Related articles

GeoSpy AI | లొకేషన్‌తో పనిలేకుండా ఫొటో అడ్రస్ పట్టేస్తుంది

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత...

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.