Homeటెక్నాలజీAirtel | లాభాల్లో జియోను దాటేసిన ఎయిర్​టెల్​

Airtel | లాభాల్లో జియోను దాటేసిన ఎయిర్​టెల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Airtel | ప్రస్తుతం దేశంలో జియో(Jio), ఎయిర్ టెల్​(Airtel), వీఐ(VI), బీఎస్​ఎన్​ఎల్​ టెలికాం(BSNL Telecom) కంపెనీలు ఉన్నాయి. ఇందులో యూజర్ల పరంగా జియో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్​టెల్​ రెండోస్థానంలో ఉంది. అయితే యూజర్లు ఎక్కువగా ఉన్న జియో కంటే.. ఎయిర్​టెల్​ అధిక లాభాలు సంపాదించడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఒక్కో యూజర్​పై ఎయిర్ ​టెల్​ పొందే అధికంగా ఉండటమే.

ప్రస్తుతం జియోకు 470 మిలియన్ల సబ్​స్క్రైబర్లు, ఎయిర్​టెల్​కు 390 మిలియన్ల సబ్​స్క్రైబర్ల ఉన్నారు. మార్కెట్​ షేరు పరంగా జియో 41శాతం వాటా కలిగి ఉండగా.. ఎయిర్​టెల్​ 34శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. అయితే ఎయిర్​టెల్​ ఒక్కో యూజర్​ నుంచి నెలకు సగటున రూ. 245 ఆర్జిస్తుండగా.. జియోకు ఇది రూ. 206గా ఉంది. దీంతోనే యూజర్లు తక్కువగా ఉన్న ఎయిర్​టెల్​ ఆదాయం ఎక్కువగా నమోదు అయింది. ఆ సంస్థ రూ.1,72,985 కోట్ల రెవెన్యూ జనరేట్​ చేయగా.. జియో రూ.1,50,270 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా ఎయిర్​టెల్​ కస్టమర్లు(Airtel customers) నెలకు సగటున 24.5 జీబీ డాటా వినియోగిస్తుండగా.. జియో యూజర్లు 32.15జీబీ డాటా వాడుతున్నారు.