HomeతెలంగాణTelangana govt | ఇక 10 గంటల పని సమయం.. వాణిజ్య సంస్థల నిబంధనల్లో సడలింపు..

Telangana govt | ఇక 10 గంటల పని సమయం.. వాణిజ్య సంస్థల నిబంధనల్లో సడలింపు..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Telangana govt : తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) విధానాన్ని ప్రోత్సహించేందుకు అడుగులు వేసింది.

రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలకు (షాపులను మినహాయించి) ఉద్యోగుల (employees) పని సమయానికి మినహాయింపులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు మంగళవారం(జులై 8, 2025) నుంచి అమలులోకి రానున్నాయి.

Telangana govt : తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం ప్రకారం..

రోజుకు ఉద్యోగులు గరిష్ఠంగా 10 గంటలు, వారానికి 48 గంటల వరకు పనిచేయొచ్చు. కాగా, ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన భద్రతా ప్రమాణాలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం..

  • రోజుకు గరిష్ఠంగా 10 గంటలు మాత్రమే పని.
  • వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే, ఓవర్‌టైమ్ వేతనం తప్పనిసరి ఇవ్వాలి.
  • 6 గంటలకుపైగా పని చేసిన వారికి కనీసం 30 నిమిషాల విరామం తప్పనిసరి కేటాయించాలి.
  • రోజువారీ మొత్తం పని సమయం 12 గంటలను మించకూడదు.
  • ఓవర్​ టైమ్​ విషయానికి వస్తే.. ప్రతి త్రైమాసికానికి గరిష్ఠంగా 144 గంటలు మాత్రమే అనుమతి.

ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే మినహాయింపును రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.