Homeజిల్లాలునిజామాబాద్​National Unity Day | యువత సన్మార్గంలో నడిచి దేశానికి ఆదర్శంగా నిలవాలి: బోధన్ సబ్...

National Unity Day | యువత సన్మార్గంలో నడిచి దేశానికి ఆదర్శంగా నిలవాలి: బోధన్ సబ్ కలెక్టర్

యువత సన్మార్గంలో నడవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పేర్కొన్నారు. పట్టణంలో 2 కే రన్ లో ఆయన పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: National Unity Day | యువత సన్మార్గంలో నడిచి దేశానికి ఆదర్శంగా నిలవాలని బోధన సబ్ కలెక్టర్ వికాస్​ మహతో (Sub-Collector Vikas Mahato) అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవంలో భాగంగా బోధన్ పోలీసుల ఆధ్వర్యంలో 2కేరన్​ నిర్వహించారు. ఈ సందర్భంగా రన్​లో సబ్​ కలెక్టర్​ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభ్​ భాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న 2కే రన్ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

National Unity Day | పటేల్​ను ఆదర్శంగా తీసుకోవాలి

ప్రతి పౌరుడు కూడా సర్దార్ వల్లభ్​ భాయ్ పటేల్​ను (Sardar Vallabhbhai Patel) ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడవాలని వికాస్​ మహతో సూచించారు. యువత ఎటువంటి దుర్వ్యసనాలకు లోనుకాకుండా దేశానికి ఉపయోగపడే పనులు చేయాలని పేర్కొన్నారు. అయితే 2కే రన్​ పెగడాపల్లి చౌరస్తా నుంచి ప్రారంభమై అంబేడ్కర్​ చౌరస్తా వరకు కొనసాగింది. అదేవిధంగా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ (Bodhan Rural Police Station) పరిధిలో సాలూర క్యాంప్​ నుంచి జాడి వరకు 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ తహశీల్దార్​ విఠల్, టౌన్ సీఐ వెంకట్ నారాయణ, ప్రైవేట్ విద్యాసంస్థల డైరెక్టర్లు దుష్యంత్, శ్రీనివాస్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.