CP Sai Chaitanya | యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆయన పాల్గొన్నారు. ఎడపల్లి పోలీస్​స్టేషన్ (Edapalli Police Station) పరిధిలో జిల్లా పోలీస్ శిక్షణ మైదానంలో 26 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా క్రికెట్​ టోర్నీని బోధన్​ పోలీసుల (Bodhan Police) ఆధ్వర్యంలో నిర్వహించారు. […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆయన పాల్గొన్నారు.

ఎడపల్లి పోలీస్​స్టేషన్ (Edapalli Police Station) పరిధిలో జిల్లా పోలీస్ శిక్షణ మైదానంలో 26 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా క్రికెట్​ టోర్నీని బోధన్​ పోలీసుల (Bodhan Police) ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం టోర్నీ ముగింపు కార్యక్రమం నిర్వహించగా.. సీపీ సాయిచైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఈ టోర్నీ నిర్వహించినట్లు తెలిపారు. యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) కార్యక్రమాన్ని బోధన్ పోలీస్ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి నిర్వహించడం అభినందనీయమన్నారు.

యువత ఉత్సాహంగా టోర్నీలో పాల్గొన్నారని సీపీ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదని.. మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలన్నారు. ఈ రోజుల్లో యువత మత్తుపదార్థాల వైపు ఆకర్షితులవున్నారన్నారు.
ఒక్కసారి ఈ వ్యసనాల్లోకి అడుగుపెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువత దేశ భవిష్యత్తు అని.. తాము ఆరోగ్యంగా ఉంటూ.. మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు సానుకూలమైన దారిలో నడిచేలా చేస్తాయన్నారు.

అనంతరం.. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, బోధన్ ఎస్​హెచ్​వో వెంకట్ నారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎడపల్లి ఎస్సై రమ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందేర్ రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్, కోటగిరి ఎస్సై సునీల్ 26 జట్ల క్రీడాకారులు యువత పాల్గొన్నారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...