Homeతాజావార్తలుHyderabad | డ్రగ్స్ ఓవర్ ​డోస్​తో యువకుడి మృతి

Hyderabad | డ్రగ్స్ ఓవర్ ​డోస్​తో యువకుడి మృతి

రాజేంద్ర నగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో నలుగురు కలిసి డ్రగ్స్​ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో డ్రగ్స్​ ఓవర్​ డోస్​ అయి ఓ యువకుడు మృతి చెందాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ కల్చర్​ పెరిగిపోతోంది. ఎంతో మంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా నగరంలో డ్రగ్స్​ ఓవర్​ డోస్​తో ఓ యువకుడు మృతి చెందాడు.

నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar)​కు చెందిన అహ్మద్​ అలీ మొబైల్​ టెక్నీషియన్​గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఓ అపార్ట్​మెంట్​లో అలీ మరో ముగ్గురితో కలిసి డ్రగ్స్​ పార్టీ చేసుకున్నాడు. ఇందులో ఇద్దరు యువతులు ఉన్నారు. అయితే డ్రగ్స్​ ఓవర్​ డోస్​ కావడంతో అలీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతడి స్నేహితులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి డ్రగ్స్​ తీసుకున్నట్లు తెలియడంతో పోలీసులకు ఫోన్​ చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పోలీసులు రాగానే యువతులు పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని డ్రగ్స్​ టెస్ట్​ చేశారు. ముగ్గురికి డ్రగ్స్​ పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు తెలిపారు

Hyderabad | ఇటీవల గచ్చిబౌలిలో..

నగరంలో డ్రగ్స్​ పార్టీలు పెరుగుతున్నాయి. విచ్చలవిడిగా డ్రగ్స్​ దొరుకుతుండటంతో యువత వాటికి బానిసలు మారుతున్నాయి. ఎంజాయ్​ కోసం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో కొందరు డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా.. ఎస్​వోటీ పోలీసులు దాడులు (SOT Police Raids) చేశారు. మొత్తం 12 మందిని అరెస్ట్​ చేశారు. కర్ణాటక (Karnataka) నుంచి తెచ్చి హైదరాబాద్​ లోని యువకులకు డ్రగ్స్​ విక్రయిస్తున్న స్మగ్లర్​ గుత్తా తేజకృష్ణతో పాటు మరో నైజీరియన్​ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా రాజేంద్ర నగర్​లో డ్రగ్స్​ పార్టీ జరగ్గా.. ఓ యువకుడు మృతి చెందాడు.