Yellareddy | బస్సును ఢీకొని యువకుడు మృతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | బస్సును వెనుక నుంచి ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. హాజీపూర్​ వద్ద ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (Palle Velugu bus) కామారెడ్డి నుంచి పిట్లం వైపు వెళ్తోంది. మార్గమధ్యంలో హాజీపూర్ గ్రామంలో (Hajipur village) ఓ ప్రయాణికుడిని దింపే క్రమంలో బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. బస్సు వెనకే వస్తున్న […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | బస్సును వెనుక నుంచి ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. హాజీపూర్​ వద్ద ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (Palle Velugu bus) కామారెడ్డి నుంచి పిట్లం వైపు వెళ్తోంది.

మార్గమధ్యంలో హాజీపూర్ గ్రామంలో (Hajipur village) ఓ ప్రయాణికుడిని దింపే క్రమంలో బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. బస్సు వెనకే వస్తున్న మాదిగ కాశీరాం(32) బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కాశీరాం లింగంపేట మండలం మంబాజీపేటకు చెందినవాడిగా గుర్తించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related articles

Kamareddy corruption free governance | కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందించాలి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy corruption free governance | కామారెడ్డి పట్టణ ప్రజలకు (Kamareddy Municipality) అవినీతి రహిత పాలన అందించాలని కొత్తగా బాధ్యతలు...

Kalvakuntla Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ : కల్వకుంట్ల కవిత

జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు

Kamareddy Yellow Alert | కామారెడ్డికి ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Yellow Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి (Kamareddy), కొమురం భీం...

Municipal Election Shock | బీజేపీ, బీఆర్​ఎస్​లకు మున్సిపల్​ ఎన్నికలు షాక్​ ఇచ్చాయి : మానాల మోహన్​రెడ్డి

మున్సిపల్​, జీపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​లకు షాక్​ తగిలిందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.