Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

Kamareddy | ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు (private finance harassment) తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలంలోని (Machareddy mandal) చుక్కాపూర్ గ్రామానికి చెందిన రమేష్ భవన నిర్మాణ రంగంలో లేబర్​గా పనిచేస్తున్నాడు.

2024 జూలైలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్​లో (private finance) రమేష్ తన ఇంటిపై రూ.6 లక్షల లోన్ తీసుకున్నాడు. ఈఎంఐ రెగ్యులర్​గా చెల్లించిన రమేష్ గత జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన ఈఎంఐలు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చెల్లించలేదు.

దాంతో కొద్ది రోజులుగా ఫైనాన్స్ కంపెనీ (finance company) ప్రతినిధులు ఫోన్లు చేస్తూ తరచుగా వేధింపులకు గురి చేస్తున్నారు. పైగా రమేశ్​ ఇంటికి ‘ఈ ప్రాపర్టీ లీగల్ ప్రాసెస్​లో ఉన్నది. దీనిపై ఎలాంటి లావాదేవీలు జరపరాదు’ అని ఫైనాన్స్ కంపెనీ పేరుతో నోట్​ రాశారు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో దులానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా రమేశ్​ భార్య సంధ్య మాట్లాడుతూ.. తన భర్త రమేశ్​ ఫైనాన్స్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇలాంటి వేధింపులతో మరొక ప్రాణం పోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుడు రమేష్​కు కొడుకు అశ్విత్ కూతురు ఆద్య ఉన్నారు.

Must Read
Related News