అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో (Kondapru) పోలీసులు శనివారం రాత్రి రేవ్పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. మాదాపూర్లోని ఓ విల్లాలో రేవ్ పార్టీ (Rave Party) నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన అశోక్ కుమార్ ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
Hyderabad | ప్రతివారం పార్టీలు
ఏపీకి చెందిన అశోక్ కుమార్ బడాబాబులే లక్ష్యంగా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రతివారం ఏపీ (AP) నుంచి యువతి, యువకులను రప్పించి హైదరాబాద్ నగరంలో పార్టీలు అరెంజ్ చేస్తున్నాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే లక్ష్యంగా ఆయన వీటిని ఏర్పాటు చేస్తున్నాడు. మత్తుకు బానిసలైన యువతులను పిలిచి.. ఏపీకి చెందిన బడాబాబులతో పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన వద్ద డ్రగ్స్, గంజాయి, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | కారుకు ఎంపీ స్టిక్కర్
రేవ్ పార్టీ నిర్వహించిన అశోక్ కుమార్ కారుకు లోక్సభ ఎంపీ (Lok Sabha MP) స్టిక్కర్ ఉండడం గమనార్హం. తన ఫార్చునర్ కారుకు ఎంపీ స్టికర్ అతికించుకొని ఆయన తిరుగుతున్నాడు. ప్రతి వీకెండ్లో ఆంధ్ర నుంచి యువతీయువకులను తీసుకొచ్చి హైదరాబాద్లో రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. దీని కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ స్టిక్కర్ ఎక్కడి నుంచి దానిపై విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు (Excise officers) దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | జోరుగా డ్రగ్స్ దందా
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. వీటి నివారణకు ప్రభుత్వం ఈగల్ టీం (Eagle Team) ఏర్పాటు చేసినా దందా మాత్రం ఆగడం లేదు. ఎంతో మంది వీటికి బానిసలుగా మారారు. ఇటీవల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant) యజమానిని డ్రగ్స్ కేసులో ఈగల్ టీం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగరంలోని చాలా ప్రాంతాల్లో గంజాయి దొరుకుతోంది. ఇటీవల ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి గంజాయికి బానిసైన పలువురిని అదుపులోకి తీసుకుంది. యువత ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.