అక్షరటుడే, వెబ్డెస్క్ : Reels | ఇన్స్టాగ్రామ్ instagram లో రీల్స్ reels చేసి ఫేమస్ అయిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఎన్టీఆర్ NTR జిల్లా విసన్నపేట మండలం ఏ కొండురు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మధుమతి(22) ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేది. ఈ క్రమంలో వేలాది మంది ఫాలోవర్లను followers సొంతం చేసుకుంది.
Reels | అదే కారణమా..?
అయితే ఆమెకు తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ప్రతాప్కు అంతకుముందే పెళ్లి కావడం గమనార్హం. ఈ విషయం తెలిసిన మధుమతి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయినా కూడా ప్రతాప్, మధుమతిని కలిసేవాడు.
ఈ క్రమంలో మధుమతి అమ్మమ్మ వాళ్లింట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. తమ కూతురును ప్రతాప్ చంపేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతాప్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
