ePaper
More
    HomeUncategorizedYellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

    Yellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు (Yellareddy Police) తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శబ్దల్‌పూర్‌ (Shabdalpur village) గ్రామానికి చెందిన బత్తుల రాంచందర్, గంగామణికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

    ఇటీవల రాంచందర్‌ బంధువు మృతి చెందడంతో, ఈనెల 10న దశదిన కర్మ ఉండడంతో భార్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో పెద్ద కూతురు సావిత్రి(19) ఎప్పటిలాగే, ఉదయం 9 గంటలకు ఎల్లారెడ్డిలోని కంప్యూటర్‌ క్లాస్‌కు వెళ్లి, మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చింది.

    అదే సమయంలో గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మయ్య రాంచందర్‌ ఇంటికి వచ్చాడు. ఎవరూ లేకపోవడంతో, గదిలోకి వెళ్లి చూడగా సావిత్రి ఫ్యాన్‌ ఉరేసుకుని కనిపించింది. ఆమె గదిలో సూసైడ్‌ నోట్‌ కనిపించింది. అందులో షెట్పల్లి సంగారెడ్డికి చెందిన మార్గపు ప్రదీప్‌ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని పేర్కొంది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...