13
అక్షరటుడే, మెండోరా : Mendora | ఆరోగ్య సమస్యలతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెండోరా మండలంలోని వెల్గటూర్లో చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని (SI Suhasini) తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూర్ గ్రామానికి (Velgatur Village) చెందిన రెడ్డి అనూష (25) మానసిక సమస్యలు, తీవ్ర తలనొప్పి, చర్మ వ్యాధితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికీ జబ్బు నయం కాలేదు.
దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న అర్వింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా (Mendora) ఎస్సై సుహాసిని తెలిపారు.