Homeక్రైంMahabubabad | పెళ్లయిన రెండు రోజులకే యువకుడి మృతి

Mahabubabad | పెళ్లయిన రెండు రోజులకే యువకుడి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఎన్నో ఆశలతో ఒక్కటైన ఆ జంటను రెండు రోజులకే విధి విడదీసింది. ఎన్నో ఆశలు.. వందేళ్లు కలిసి బతకాలని వారు కన్న కలలను కల్లలు చేసింది. పెళ్లి చేసుకొని భార్యతో కొత్త జీవితం ప్రారంభించిన ఓ యువకుడిని కరెంట్​ షాక్ Electric shock​ రూపంలో మృత్యువు బలిగొంది. మహబూబాబాద్‌ Mahabubabad జిల్లా బయ్యారం bayyaaram మండలం కోడిపుంజుల తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్​ నరేశ్​కు రెండ్రోజుల క్రితం కృష్ణాజిల్లా krishna district కంకిపాడులో వివాహం అయింది. వివాహం చేసుకొని ఇంటికి వచ్చిన నరేశ్​ మంగళవారం కరెంట్​ షాక్​తో మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.