Homeక్రైంMohammed Nagar | రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Mohammed Nagar | రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్ : Mohammed Nagar | రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ నగర్ (Mohammed Nagar) మండలం హసన్​పల్లి గ్రామానికి చెందిన గంజి అంజయ్య(30) ఎల్లారెడ్డి నుంచి బైక్​పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆయన బైక్​ను కారు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అంజయ్యను కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ (Hyderabad)​ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News