Homeజిల్లాలునిజామాబాద్​Road Accident | బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి దుర్మరణం

Road Accident | బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి దుర్మరణం

నందిపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. జోర్​పూర్ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Road Accident | నందిపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జోర్​పూర్ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో యువకుడు మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. నందిపే మండలంలోని ఖుద్వాన్​పూర్​కు చెందిన బేగరి పోశెట్టి(30), అతని తల్లి బేగర సునీత ఇద్దరు కలిపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో పోశెట్టి మృతి చెందాడు. అతని తల్లి సునీతకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.