ePaper
More
    HomeతెలంగాణOrgans Donation | అవయవదానంతో నలుగురికి ప్రాణం పోసిన యువ లాయర్

    Organs Donation | అవయవదానంతో నలుగురికి ప్రాణం పోసిన యువ లాయర్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Organs Donation : అవయవదానంతో నలుగురికి ప్రాణం పోశారు ఓ యువ లాయర్. కావలి శివ ప్రసాద్ కుటుంబ సభ్యులు గొప్ప మనుసు చాటారు. పుట్టెడు దుఃఖంలోనూ ఉదారత చాటుకున్నారు. తెలంగాణలోని మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం బుర్గుపల్లి (Burgupalli, Jadcharla mandal, Mahabubnagar district, Telangana)కి చెందిన కావలి శివ ప్రసాద్​(22) లాయర్​గా ప్రాక్టీస్ చేస్తున్నారు.

    కాగా, జూన్ 17, 2025న ఆయన తలపై పదునైన ఆయుధం తగలడంతో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌(Hyderabad)లోని నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)కి తరలించారు. అత్యవసర చికిత్స తర్వాత జూన్ 27, 2025న మధ్యాహ్నం 3:59 గంటలకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.

    దీంతో శివ ప్రసాద్ తండ్రి కె.నర్సింలు తన తనయుడి అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను దానం చేసి, నలుగురు రోగులకు సాయపడ్డారు.

    ఇదే విషయాన్ని ఐపీఎస్​ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ ఎక్స్ X వేదికగా పోస్ట్​ చేశారు. పుట్టెడు దు:ఖంలో ఉదారత చాటుకున్న ఆ కుటుంబానికి సెల్యుట్​ చేశారు. ఆ కుటుంబ సభ్యులది గొప్ప మనస్సు అని పేర్కొన్నారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...