ePaper
More
    Homeక్రైంKurnool | పారాణి ఆరక ముందే భర్తను చంపేసిన యువతి

    Kurnool | పారాణి ఆరక ముందే భర్తను చంపేసిన యువతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kurnool | వివాహేతర సంబంధాలు సమాజంలో అనేక నేరాలకు కారణం అవుతున్నాయి. ఇటీవల రాజారఘువంశీ (Raja Raghuvamshi) హనీమూన్​ హత్య (Honeymoon Murder) ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కర్నూలు (Kurnool) జిల్లా పిన్నాపురంలో ఓ యువతి తన తల్లి, మరో వ్యక్తితో కలిసి కట్టుకున్న వాడిని హత్య చేసింది. వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

    తెలంగాణలోని గద్వాల (Gadwal)కు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్​కు పిన్నాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్యతో వివాహమైంది. అయితే భార్య ఐశ్వర్య, ఆమె తల్లి, ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ కలిసి తేజేశ్వర్​ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బ్యాంక్ మేనేజర్, ఐశ్వర్య ఫోన్లను ట్రేస్ చేసి వివరాలు సేకరించారు. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ కోసం గాలిస్తున్నారు.

    కాగా.. ఇటీవల మధ్యప్రదేశ్​కు చెందిన జంట మేఘాలయకు హానీమూన్​కు వెళ్లగా భర్తను భర్య చంపించిన విషయం తెలిసిందే. సోనమ్​ అనే మహిళా తన భర్త రాజారఘువంశీని ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమెతో పాటు ప్రియుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే ఆ ఘటన మరువక ముందే మరో యువతి తన భర్తను చంపించడం గమనార్హం.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...