Homeజిల్లాలుకామారెడ్డిYellareddy mandal | సెలవులకు ఊళ్లకు వెళ్తే.. పోలీసులకు సమాచారమివ్వాలి

Yellareddy mandal | సెలవులకు ఊళ్లకు వెళ్తే.. పోలీసులకు సమాచారమివ్వాలి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | సెలవులకు (holidays) ఊళ్లకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసు కళాబృందం (police kalabrundam) సభ్యులు పేర్కొన్నారు. మండలంలోని ఎస్​బీఐ బ్యాంక్​లో (SBI bank) గురువారం పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెలవుల్లో విద్యార్థుల ఈత నేర్చుకోవాలనుకుంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా తోడుగా ఉండాలన్నారు. సైబర్​ మోసగాళ్లు (cyber criminals) ఉన్నందున ఎవరికీ ఫోన్​లో ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్​బీఐ బ్రాంచ్​ మేనేజర్​ సీహెచ్​ మహేశ్​, కళాబృందం సభ్యులు, పోలీసు సిబ్బంది (police staff) తదితరులు పాల్గొన్నారు.