అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | సోమార్పేట్ (Somarpet) ఘటనకు నిరసనగా ఈనెల 19న ఎల్లారెడ్డి బంద్కు (Yellareddy Bandh) పిలుపునిస్తున్నట్లు విపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వారు పట్టణంలోని శివాజీ చౌరస్తాలో సోమార్పేట్ గ్రామస్థులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విపక్ష నాయకులు మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం సోమార్పేట్ గ్రామానికి (Somarpet village) చెందిన సర్పంచ్ కుర్మ పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి అనే వ్యక్తి ఓటమిపాలైన బిట్ల బాలరాజు ఇంటిపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ట్రాక్టర్తో దాడికి పాల్పడడంతో బాలరాజు కుటుంసభ్యుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు గాయపడ్డారని అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
ఈ సంఘటనకు బాధ్యులైన కుర్మ చిరంజీవిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ చేశారన్నారు. అయితే తమ ఫిర్యాదులో పేర్కొన్న కురుమ సాయిబాబా, కురుమ పాపయ్యతో పాటు ఇతరులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. ట్రాక్టర్తో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడేలా ప్రేరేపించిన వ్యక్తులపై వెంటనే కేసులు నమోదుచేసి రిమాండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళనలు కొనసాగిస్తాం
బాధ్యులపై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఈనెల 19న శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ బంద్కు పిలుపునిస్తున్నట్లు విపక్ష నాయకులు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో విపక్ష నాయకులు జనార్దన్ రెడ్డి, ఆదిమూలం సతీష్, పెద్ద ఎడ్ల నర్సింలు, చిరంజీవులు, పృథ్వీరాజ్, బర్కత్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.