అక్షరటుడే, వెబ్డెస్క్: writer Boggula Srinivas | ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి పాలేరు రిజర్వాయర్లోకి ఓ కారు దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకరు దుర్మరణం చెందారు. కూసుమంచి పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు శనివారం వెళ్తున్న కారు పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లింది. గమనించిన జాలరులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నీట మునిగిన కారును పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కాగా, వాహనంలోని వెనుక సీటులో ఒకరి మృతదేహం ఉంది. అతడిని ఆంధ్రప్రదేశ్ AP లోని కర్నూలు karnool జిల్లా నందికొట్కూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్(50)గా గుర్తించారు. డ్రైవరు ప్రాణాలతో బయటపడి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీనివాస్ గత పది సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంటున్నారు. ‘పవన్ కల్యాణ్ Pavan Kalyan రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో పవన్ కల్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో.. అనే పేరుతో శ్రీనివాస్ పుస్తకం రాశారు. ఇది వివాదానికి దారితీసింది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.
writer Boggula Srinivas | ప్రమాదమా.. ఉద్దేశపూర్వకంగానా..
డ్రైవరు కారును ఉద్దేశపూర్వకంగానే పాలేరు జలాశయంలోకి దూకించి పారిపోయాడా.. లేక నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని నేలకొండపల్లి దవాఖానకు తరలించారు. శ్రీనివాస్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు కూసుమంచి ఎస్సై నాగరాజు వెల్లడించారు.