Homeక్రీడలుWorld Cup Final | చరిత్ర సృష్టించిన టీమిండియా ఉమెన్​.. వరల్డ్ కప్​ భారత్​ కైవసం

World Cup Final | చరిత్ర సృష్టించిన టీమిండియా ఉమెన్​.. వరల్డ్ కప్​ భారత్​ కైవసం

World Cup Final | మహిళా వన్డే ప్రపంచకప్​లో భాగంగా సౌత్​ ఆఫ్రికా (South Africa)తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో భారత జట్టు రాణించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : World Cup Final | ఉమెన్​ టీమిండియా Team India Women చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి.. మొదటిసారి విశ్వ విజేతలుగా నిలిచింది.

50 పరుగుల తేడాతో సఫారీలను భారత్​ జట్టు ఓడించి.. 2005, 2017 ఫైనల్స్‌లో చేజారి పోయిన కలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ captain Harmanpreet Kaur నేతృత్వంలోని టీం సాకారం చేసుకుంది. సౌత్​ ఆఫ్రికా జట్టుపై విజయం సాధించి ప్రపంచ కప్​ను సొంతం చేసుకుంది.

ముంబయిలోని వాంఖడే మైదానంలో ఆదివారం (నవంబరు 2) ఉమెన్​ వన్​డే వరల్డ్​ కప్​ 2025 ఫైనల్​ జరిగింది. భారత జట్టు, దక్షిణాఫ్రికా జట్టు తలపడ్డాయి.

మొదట టాస్​ గెలిచిన సౌత్​ ఆఫ్రికా బౌలింగ్​ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్​ చేపట్టింది. బ్యాటర్లు రాణించడంతో టీమిండియా మహిళల జట్టు 50 ఓవర్లలో 298 స్కోర్​ చేసింది.

వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్​ ఆలస్యంగా ప్రారంభం అయింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన​ భారత్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మందాన(45), షెఫాలీ వర్మ (87) రాణించారు.

వీరి తొలి వికెట్​కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెమీ ఫైనల్​లో మ్యాచ్​ గెలిపించిన జెమీమా వన్​ డౌన్​లో వచ్చి పర్వాలేదనిపించింది. 37 బంతుల్లో ఆమె 24 పరుగులు చేసింది.

షెఫాలీ తృటిలో సెంచరీ మిస్​ చేసుకుంది. కెప్టెన్​ హర్మీన్​ ప్రీత్​ కౌర్​ 20 పరుగులతో నిరాశ పరిచింది. అమ్​జోత్​ కౌర్​ 12 పరుగులకే అవుట్​ అయింది.

దీప్తి శర్మ (58) హాఫ్​ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా గోష్​ 24 బంతుల్లో 34 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపింది. దీంతో భారత్​ 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.

World Cup Final | దక్షిణాఫ్రికా కెప్టెన్​ ఒంటరి పోరు..

దక్షిణాఫ్రికా కెప్టెన్​ లారా వోల్వార్డ్ట్ సెంచరి పూర్తి చేసుకుంది. తమ జట్టు కోసం చివరి వరకు ఒంటరిగా పోరాడింది. చివరకు 101 పరుగులు చేసి ఔట్​ అయింది.