అక్షరటుడే, వెబ్డెస్క్ : World Cup Final | ఉమెన్ టీమిండియా Team India Women చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి.. మొదటిసారి విశ్వ విజేతలుగా నిలిచింది.
50 పరుగుల తేడాతో సఫారీలను భారత్ జట్టు ఓడించి.. 2005, 2017 ఫైనల్స్లో చేజారి పోయిన కలను కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ captain Harmanpreet Kaur నేతృత్వంలోని టీం సాకారం చేసుకుంది. సౌత్ ఆఫ్రికా జట్టుపై విజయం సాధించి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది.
ముంబయిలోని వాంఖడే మైదానంలో ఆదివారం (నవంబరు 2) ఉమెన్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ జరిగింది. భారత జట్టు, దక్షిణాఫ్రికా జట్టు తలపడ్డాయి.
మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేపట్టింది. బ్యాటర్లు రాణించడంతో టీమిండియా మహిళల జట్టు 50 ఓవర్లలో 298 స్కోర్ చేసింది.
వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మందాన(45), షెఫాలీ వర్మ (87) రాణించారు.
వీరి తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెమీ ఫైనల్లో మ్యాచ్ గెలిపించిన జెమీమా వన్ డౌన్లో వచ్చి పర్వాలేదనిపించింది. 37 బంతుల్లో ఆమె 24 పరుగులు చేసింది.
షెఫాలీ తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. కెప్టెన్ హర్మీన్ ప్రీత్ కౌర్ 20 పరుగులతో నిరాశ పరిచింది. అమ్జోత్ కౌర్ 12 పరుగులకే అవుట్ అయింది.
దీప్తి శర్మ (58) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా గోష్ 24 బంతుల్లో 34 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపింది. దీంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.
World Cup Final | దక్షిణాఫ్రికా కెప్టెన్ ఒంటరి పోరు..
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ సెంచరి పూర్తి చేసుకుంది. తమ జట్టు కోసం చివరి వరకు ఒంటరిగా పోరాడింది. చివరకు 101 పరుగులు చేసి ఔట్ అయింది.
