ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​kammarpally | మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం

    kammarpally | మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం

    Published on

    అక్షరటుడే, భీమ్‌గల్‌: kammarpally | రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని కమ్మర్‌పల్లి ఏఎంసీ (Kammarpally AMC) ఛైర్మన్‌ పాలెపు నర్సయ్య అన్నారు.

    మండలంలోని మెండోరలో (mendora) మంగళవారం నిర్వహించిన ఇందిరా శక్తి మహిళా (Indira Mahila Sakthi) సంబరాల్లో ఆయన మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు, పెట్రోల్‌బంక్‌ల నిర్వహణ, యూనిఫాం తయారీ, తదితర బాధ్యతలు అప్పగిస్తోందన్నారు. అంతేగాక, మరెన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

    మహిళా సంఘ సభ్యులకు ప్రమాద బీమా, రుణ బీమా (Runa Bheema) వర్తింపజేస్తోందని, 35శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి రమేష్, మండల అధ్యక్షుడు స్వామి, నాయకులు సురేందర్, నాగేంద్ర, ఐకేపీ ఏపీఎంలు రవీందర్, గంగారెడ్డి, సీసీలు, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...