అక్షరటుడే, ఇందూరు : Vijaya Mallesh Yadav | ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) సహకారంతో 23వ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని మేకల విజయ మల్లేష్ యాదవ్ తెలిపారు. ఇందూరులోని వినాయక్నగర్ (Vinayaknagar) పరిధిలోని యాదగిరి బాగ్ ప్రాంతంలో ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు.
Vijaya Mallesh Yadav | బీజేపీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధ్యం
ఈ సందర్భంగా మేకల విజయ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana) ద్వారా పేదలకు ఇళ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుధ్య మెరుగుదల, అమృత్ పథకం (Amrit Scheme) ద్వారా తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.
Vijaya Mallesh Yadav | 23వ డివిజన్లో..
23వ డివిజన్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామని మేకల విజయ మల్లేష్ యాదవ్ అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ అభ్యర్థినిని ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా, యువ మోర్చా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.