Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | యజమానినే బోల్తా కొట్టించిన వర్కర్లు: 77 కిలోల వెండి చోరీ

Nizamabad City | యజమానినే బోల్తా కొట్టించిన వర్కర్లు: 77 కిలోల వెండి చోరీ

యజమానిని మోసం చేసి వర్కర్లు వెండి చోరీ చేశారు. నిజామాబాద్​ నగరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నమ్మకంగా పనిచేస్తున్నట్లుగా నమ్మించిన ఇద్దరు వర్కర్లు తమ యజమానినే మోసం చేశారు. తాము పనిచేసిన సిల్వర్​ మర్చంట్ (Silver Merchant) వద్దే ఏకంగా 77 కిలోల వెండిని చోరీ చేశారు.

వన్​టౌన్​ ఎస్​హెచ్​వో (One Town SHO) రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కిషన్​గంజ్​ (Kishanganj) సమీపంలో ఉన్న శ్రీసాయి గోల్డ్​ అండ్​ సిల్వర్​ మర్చంట్​లో (Sri Sai Gold and Silver Merchant) విష్ణువర్ధన్, ప్రశాంత్​లు మూడేళ్లుగా నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు.

Nizamabad City | యజమానికి దుకాణానికే కన్నం వేసేందుకు ప్లాన్​..

కాని వారిలో దుర్బుద్ధి పుట్టి యజమాని దుకాణానికే కన్నం వేసేందుకు ప్రణాళిక వేశారు. దీంట్లో భాగంగా విడతల వారీగా వెండిని చోరీ చేస్తూ వచ్చారు. అనుమానం వచ్చిన షాప్​ యజమాని శివకుమార్ పాటిల్ ఇద్దరు వర్కర్లను వెండి దొంగలిస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. మొత్తం 77 కిలోల వెండిని వారు చోరీ చేసినట్లుగా గుర్తించారు. వెంటనే బాధితుడు శివకుమార్ వన్ టౌన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్​హెచ్​వో వివరించారు.